AP Free Bus for Women Scheme 2025 – పూర్తి వివరాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్ట్ 15, 2025 నుండి మహిళలు మరియు ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించనున్నది. స్త్రీశక్తి పథకం కింద ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఖర్చు లేకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు.
ఉచితంగా ప్రయాణించగల బస్సులు:
- పల్లెవెలుగు
- ఎక్స్ప్రెస్
- సిటీ ఆర్డినరీ
- మెట్రో ఎక్స్ప్రెస్
మినహాయింపు:
తిరుపతి-తిరుమల రూట్లో నడిచే సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం లేదు. ఆర్టీసీ ప్రకారం, ఈ రూట్లో టికెట్ కొనుగోలు చేయడం తప్పనిసరి.
Eligibility
- మహిళలు & ట్రాన్స్జెండర్లు
- ఏ వయసైనా సరే
- గుర్తింపుగా ఆధార్, ఓటర్ ID, లేదా రేషన్ కార్డు చూపించాలి
ముఖ్యాంశాలు:
- 15 లక్షల నుండి 26 లక్షల వరకు ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం
- రూ. 1,950 కోట్లు ప్రభుత్వానికి భారం అయినా మహిళల సాధికారత కోసం నిర్ణయం
- 6,700 RTC బస్సులు ఈ పథకం కోసం కేటాయింపు
- భవిష్యత్తులో స్మార్ట్ కార్డులు, 3,000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించనున్న ప్రణాళిక
అమలు తేదీ:
🗓️ ఆగస్ట్ 15, 2025 నుండి రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి వస్తుంది.